- Advertisement -
బెంగళూరు : విద్యుత్ ద్విచక్ర వాహనాల కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ సంస్థ మోటార్ సైకిల్ విభాగంలో ‘రోర్ ఈజెడ్ సిగ్మా’ పేరుతో కొత్త మోడల్ను విడుదల చేసింది. ఒకసారి పూర్తి చార్జింగ్తో 175 కిమీ వరకు ప్రయాణించవచ్చు. దీన్ని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.27 లక్షలు, 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.37 లక్షలుగా నిర్ణయించింది. రూ.2,999 టోకెన్ అమౌంట్ను చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లుగా ఉందని పేర్కొంది.
- Advertisement -