వీధుల్లో నడవాలంటే ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు
మెయిన్ రహదారిలో మోకాలు లోతు గుంతలు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్ల నగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో మెయిన్ బజారు పూర్తి వర్షం నీటితో బురద మయంగా మారింది. పేరు పెద్ద ఊరు దిబ్బ అనే చందం లా గ్రామం లోని వీదులన్నీ మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడి నడవడానికి ఇబ్బందిగా మారింది.పెద్దగూడెం నుంచి మెయిన్ బజారు లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షాలు కురిసినప్పుడు, గ్రామ ప్రాంతాల్లోని రోడ్లు బురదమయంగా మారి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీనితో స్థానికులకు చాలా ఇబ్బందిగా మారింది. తాజాగా రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.
దీంతో అటుగా వెళ్లే 10 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందులో05 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. 20 ఏళ్ల క్రితం కింద వేసిన ఈ రోడ్డు అద్వానంగా మారాయి.వీధుల్లో మురుగు కాలువలులేక బజార్లు బురద మయయంగా మారాయి.ముఖ్యంగా గ్రామం లోని మెయిన్ బజారు మోకాళ్ళ లోతులో నీళ్లు చేరడం తో నానా అవస్థలుపడుతున్నారు.రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో 05 గ్రామాల ప్రజలు రవాణా కష్టాలను ఎదుర్కొంటున్నారు.అధికారులు రోడ్లు బాగుచేయాలని గ్రామస్తులు కోరుకుంటూన్నారు.
బురదమయంగా పెద్దగూడెం గ్రామం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES