నవతెలంగాణ – కామారెడ్డి
నులిపురుగుల నివారణకు 1 నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవం 2025 సంవత్సరంకు కామారెడ్డి జిల్లాలో అన్ని పాఠశాలల లో, అంగన్వాడీ పాఠశాల లలో, ఇంటర్మీడియట్ కళాశాలలో ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు (ఆల్బెండజోల్) లను వేశారు. ఈ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలం దేవునిపల్లిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకుని నులిపురుగుల వల్ల సంభవించు రక్తహీనత, ఆకలిలేమి, మానసిక, ఆరోగ్య పరంగా ఎదుగుదల వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒకటి నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈరోజు నులి పురుగుల నివారణ మాత్రలు వేయించుకొని వారు ఈ నెల ఆగస్టు 18 వ తారీఖున వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి చంద్రశేఖర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, రాజు జిల్లా విద్యా శాఖ అధికారి, ప్రభు కిరణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, డాక్టర్ విద్యా, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి , మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.