నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా దిగుమతులపై ప్రతీకార సుంకాల విధింపును మరో 90 రోజులు పొడిగించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఈమేరకు సంతకాలు చేశారు. బీజింగ్ నుంచి వాణిజ్య ఒప్పందాలపై సానుకూలత వ్యక్తం కానుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ ఏడాది ఏప్రీల్ లో ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్లో యూఎస్తో ఢీ అంటే ఢీ అని చైనా సమరానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇరుదేశాలు సుంకాలను క్రమేణా పెంచుకున్నాయి. అమెరికా.. చైనా వస్తువులపై 145 శాతం సుంకాలను విధించింది. దీంతో చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది.
అయితే, మేలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన సమావేశంలో రెండు దేశాలు తాత్కాలికంగా సుంకాలను తగ్గించడానికి అంగీకరించాయి. అమెరికా తన సుంకాలను 145 శాతం నుండి 30 శాతానికి తగ్గించింది మరియు చైనా తన సుంకాలను 125 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. కానీ చర్చలు ఇంకా కొనసాగుతున్నందున విరామం వచ్చింది.