నవతెలంగాణ-హైదరాబాద్: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ …. కడప ఎంపి అవినాష్రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే అవినాష్ నిరసనకు దిగారు. వైసిపి శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి, అవినాష్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
వేంపల్లిలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డిని, పులివెందులలో టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ ఎన్నికలను కూటమి, వైసిపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసిపి నేత హేమంత్రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.