హైదరాబాద్ : టెక్నాలజీ కంపెనీ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ తమ మాస్ వేదికలో భాగంగా ఎఐ ఆధారిత ఎలక్ట్రిక్ ద్వి చక్రాల వాహన బ్రాండ్ థింక్స్ను అందుబాటులోకి తేనుంది. దీనిని మాదాపూర్లో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నదెండ్ల మనోహర్, ఎపి ఇండిస్టీస్ మంత్రి టిజి భారత్ లాంచనంగా ఆవిష్కరించారు. ఎఐ ఆధారిత థింక్స్ ఉత్పత్తి తయారీకి రూ.800 కోట్ల పెట్టుబడులు అవసరం కావొచ్చని పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సిఇఒ టిజి విశ్వప్రసాద్ పేర్కొన్నారు. థింక్స్తో తాము కేవలం ఒక వాహనాన్ని ఆవిష్కరించడమే కాదని.. ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. 2027 చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.