- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను మాజీ జెడ్పిటిసి లక్ష్మీనర్సగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. సబ్ కలెక్టర్ నూతన ఉద్యోగ బాధ్యతలు చేపట్టండంతో నాయకులు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ముధోల్ నియోజక వర్గంలో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ రాథోడ్, మాజీ ఎంపిటిసి ఆత్మ స్వరూప్,మాజీ సర్పంచ్ లు రాంచంధర్,శ్యామ్ రావ్.,నాయకులు సాయిలు, సాహెబ్ రావ్, తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -