– జెండాను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్రెడ్డి
– 32 జిల్లాల్లో మంత్రులు, ప్రముఖులు
– సీఎస్ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రస్థాయిలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని గోల్కొండ కోట, రాణి మహల్ వద్ద నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాల్లో జాతీయ జెండాను మంత్రులు, ప్రముఖులు ఎగుర వేయనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఆదిలాబాద్: షబ్బీర్ ఆలీ, ప్రభుత్వ సలహాదారు
భద్రాద్రి కొత్తగూడెం: తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి
హన్మకొండ: కొండా సురేఖ, అటవీ శాఖ మంత్రి
జగిత్యాల : అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి
జయశంకర్ భూపాలపల్లి: బెల్లయ్య నాయక్, ఎస్టీ సహకార ఆర్థిక సంస్థ చైర్మెన్
జనగామ: బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్
జోగులాంబ గద్వాల: ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, సలహాదారు
కామారెడ్డి: ఎం. కోదండరెడ్డి, వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మెన్
కరీంనగర్: దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి
ఖమ్మం: మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
కొమురం భీం ఆసిఫాబాద్: బండా ప్రకాష్, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్
మహబూబాబాద్ : జె.రామంచర్ నాయక్, అసెంబ్లీ విప్
మహబూబ్ నగర్: జూపల్లి కష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి
మంచిర్యాల: హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు
మెదక్: జి. వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ మంత్రి
మేడ్చల్: కె. కేశవరావు, ప్రభుత్వ సలహాదారు
ములుగు: ధనసరి అనసూయ సీతక్క, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
నాగర్ కర్నూల్: జి. చిన్నారెడ్డి, ప్రణాళికా సంఘం వైఎస్ ఛైర్మెన్
నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి
నారాయణపేట: వాకిటి శ్రీహరి, పశు సంవర్థక శాఖ మంత్రి
నిర్మల్: సిరిసిల్ల రాజయ్య, తెలంగాణా ఆర్థిక సంఘం ఛైర్మెన్
నిజామాబాద్: నిరంజన్, బీసీ కమిషన్ ఛైర్మెన్
పెద్దపల్లి: ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్
రాజన్న సిరిసిల్ల: ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
రంగారెడ్డి: వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు
సంగారెడ్డి: దామోదర రాజనరసింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
సిద్దిపేట: పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
సూర్యాపేట: ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
వికారాబాద్: గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ స్పీకర్
వనపర్తి: పట్నం మహేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్
వరంగల్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
యాదాద్రి భువనగిరి: గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మెన్
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES