Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంహైడ్రా అన్ని రాష్ట్రాలకు అవసరం

హైడ్రా అన్ని రాష్ట్రాలకు అవసరం

- Advertisement -

బతుకమ్మకుంటను సందర్శించిన
ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలని ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు అన్నారు. అప్పుడే చెరువులు, నాలాలు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను బుధవారం సాయంత్రం ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు సందర్శిం చారు. చెరువు చుట్టూ తిరిగి.. అక్కడి అభివృద్ధిని పరిశీలించారు. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిన ప్రాంతం సుందరీకరణ, చెరువులా రూపాం తరం చెందడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ చెరువు నిర్మాణం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందని బృందానికి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీ మున్సిపల్‌ హార్టికల్చర్‌ విభాగం అధిపతి డా. ఆశిష్‌ అన్నారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించడం, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చిన వీడియోలను పరిశీలించారు. చెరువు చుట్టూ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలను అడిగి తెలుసుకు న్నారు. ఢిల్లీలో కూడా చెరువులు చాలా వరకు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా వంటి సంస్థతో వాటిని పునరుద్ధరించడం, పరిరక్షించడం సులభం అవుతుం దని అన్నారు. ఈ చెరువు పునరుద్ధరణ జరగనప్పుడు వరద ప్రభావం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే అంశంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాలువలోంచి వరద నీరు మాత్రమే వచ్చేలా ఇన్‌లెట్‌ను నిర్మించడాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద నీరు ఎలా వచ్చి చేరిందో వీడియోల ద్వారా హైడ్రా అధికారులు చూపించారు. ఈ వరద నీరు గతంలో ఎటు వెళ్లేదని స్థానికులతో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. వరద నీరు తమ బస్తీలను, కాలనీలను ముంచెత్తేదని, ఈ సారి ఆ ముప్పు తప్పిందని వారు వివరించారు. చెరువు ఔట్‌లెట్లను ఢిల్లీ బృందం పరిశీలించింది. వారి వెంట హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్‌, చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్‌ టెక్నోక్రాట్‌ ఎండీ పి.యూనస్‌, హెచ్‌ఎండీఏ, ఏఎస్‌సీఐ అధికారులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad