- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థిని విద్యార్థులు గోపికలు, శ్రీ కృష్ణ వేషధారణలతో దండియాలను ఆడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్, సూపర్వైజర్ రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -