Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పంచుడు బందు చేసి… పెంచుడు షురూ చేసిండ్రు 

కాంగ్రెస్ పంచుడు బందు చేసి… పెంచుడు షురూ చేసిండ్రు 

- Advertisement -

– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 
– ప్రజల పై పన్నుల భారం పై హరీష్ రావు ఫైర్
నవతెలంగాణ –  సిద్ధిపేట 

ప్రజలపై పన్నుల భారం ఉండదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పంచుడు బందు చేసి… పెంచుడు షురూవు చేసిండ్రు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ గారు పన్నులు దించితే.. రేవంత్ రెడ్డి పెంచుతుండని, ప్రజల పై పన్నుల భారం పై హరీష్ రావు ఫైర్ అయ్యారు.  రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భార తప్ప ఏమీ లేదు అన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు, దొడ్డి దారిన పన్నులు మోపుతున్నారని అన్నారు.

అసలే ఆర్థిక మాంద్యం.. వరసగా రెండో నెల డిఫ్లేషన్ లో ఉంది.. తెలంగాణలో వరసగా ఇది రెండో సారి అని అన్నారు.  పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ షాక్ ఇస్తున్నారని అన్నారు. గత నెల, ఈ నెలలో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో రెండు వేల కోట్ల భారం వేశారని, గతంలో 100 సర్వీస్ టాక్స్ ను 200 లు చేశారని,  వెహికిల్ సర్వీస్ టాక్స్ 400 నుంచి వన్ పర్సంటేజ్ కు పెంచారని, రోడ్ టాక్స్ నూ పెంచారని, త్వరలోనే భూ రిజిస్ట్రేషన్ల ధరలు  పెంచనున్నారని అన్నారు. పెనాలిటిల పేరిట గత నెల వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారం వేశారని అన్నారు.  గతంలో 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది 6900 కోట్లు మాత్రమే వచ్చిందని, ప్రభుత్వ నిర్వాహక మూలంగా  ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు.  పదేళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ లో టాక్స్ లు రద్దు చేసి పేదలకు సాయం చేశామని అన్నారు. 

రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నరని అన్నారు. మేము పన్నులు తొలగిస్తే.. మీరు పన్నులు వేస్తున్నారు.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు. ఆర్ అండ్ బి, పీఆర్ లో అన్యూటి మోడల్ లో రోడ్లు వేయాలని కుట్ర చేస్తున్నారని, ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి ఆ అప్పులు కడతారు.. దీన్ని  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పండగలు వస్తె పాపం.. పండగకు ముందు వారం, పండగ తరువాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారని, సామాన్యులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారని అన్నారు. మద్యం ధరలు రెండు సార్లు పంచారని, ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట, మహిళల తాళ్లు తెంపుతారా అని ప్రశ్నించారు.

పేద ప్రజల రక్తమాంసాలు పిలుస్తారా  అని ప్రశ్నించారు. డిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు.  నీ ఆర్ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిందని అన్నారు. వెంటనే ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, కనకరాజు, సాయిరాం, అరవింద్ రెడ్డి, మహేష్, మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad