- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం కోటా కాలనీలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో నూర్ వంట మనిషిగా పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. నూర్ పాకిస్థాన్ ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరు అతని సోషల్ మీడియా ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
- Advertisement -