- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని నలుగురు మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులతోపాటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్చల్లో పాల్గొన్నారు.
- Advertisement -