- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ గ్రామానికి చెందిన జంగిలి వసంత పేరిట మంజూరైన రూ. 25, 500/- సీఎం సహాయనిది చెక్కను బీఆర్ఎస్ నాయకుల ఆనంద్ లబ్ధిదారులకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, మాజీ ఎంపీటీసీ లింగం, బీఆర్ఎస్ నాయకులు శంకర్, ప్రవీణ్, సత్యం, పోలే అశోక్, రవి, ఈడుదులపల్లి శ్రీనివాస్, వెంకట్, రామచంద్రయ్య, సంజీవ, రాజు, దాసు, జగన్, రామస్వామి, ఆగమ్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -