ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ దండు రమేష్..
నవతెలంగాణ – మల్హర్ రావు
దళిత సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ భూపాలపల్లి జిల్లా చైర్మన్, జాతీయ గ్రామీణ ఉపాదిహమి పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు దళిత సాధికారత కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, పార్టీ నిర్మాణం అధికార దిశగా నడిపిన దళిత నాయకులకు సమూచిత స్థానం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులను సామజికంగా,ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. వారి స్థాయిలను బట్టి ప్రభుత్వంలో సమూచిత స్థానం కచ్చితంగా కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితున్ని రాష్టానికి సీఎం చేస్తామని బిఆర్ఎస్ మోసం చేయడమే కాకుండా భౌతికంగా దళితులపై అరాచకాలు, దాడులు చేసి ఇబ్బందులకు గురిచేసినట్లుగా వాపోయారు.
దళిత సాధికారత కాంగ్రెస్ తోనే సాధ్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES