- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో టోల్ ప్లాజా వద్ద జవాన్ను టోల్ సిబ్బంది దాడి చేసిన విషయం తెలిసిందే. జవాన్ను కొట్టడాన్ని నిరసిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు టోల్ ప్లాజాపై దాడి చేశారు. సిబ్బందిని కొట్టి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతకుముందు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజా ఏజెన్సీపై రూ.20 లక్షల ఫైన్ విధించింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉల్లంఘించినందుకు భవిష్యత్లో వేలంలో పాల్గొనకుండా బ్యాన్ చేసింది.
- Advertisement -