Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగులు ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగులు ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు 0 నుండి 14 సంవత్సరాల దివ్యాంగులకు ప్రత్యేక నిర్ధారణ శిబిరము ఈనెల 26న జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలలో జరుగును. కావున గాంధారి మండల మరియు పరిసర ప్రాంత దివ్యాంగ బాలబాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా మనవి. ఈ నిర్ధారణ శిబిరంలో దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను నిర్ధారించి అందించబడును. 

దివ్యాంగులు వారి వెంట తీసుకురావలసిన పత్రాలు..

1. ఆధార్ కార్డు 
2. సదరం సర్టిఫికెట్ 
3. యు డి ఐ డి కార్డు ఉంటే
4. రేషన్ కార్డు 
5. ఫోటోలు 2 తీసుకొని ఉదయం 9 గం,ల వరకు ఉన్నత పాఠశాల ప్రాంగణానికి రాగలరని మనవి. ఇట్టి సదుపాయాన్ని దివ్యాంగులైన తల్లిదండ్రులందరూ వినియోగించి వారి వారి ఉపకరణాలను పొందగలరని సూచించారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad