- Advertisement -
– జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్
నవతెలంగాణ – జుక్కల్
బిచ్కుంద మండలంలోని ఐటిఐ ( ITI) లో , ఐటిఐ (ITI) తో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశారని జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాల లో 10 వ తరగతి ఉత్తీర్ణులైనవారు, ఇంటర్ మధ్యలో ఆపేసినవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తు చేసుకునేందుకు మెమో, బోనఫైడ్, ఆదార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలతో మీరు మీకు సంబంధించిన కోర్స్ దరఖాస్తు చేసుకొన గలరని విజ్ఞప్తి చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేశారు.
- Advertisement -