Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకార్మికులకు 8 నెలల వేతన బకాయిలు

కార్మికులకు 8 నెలల వేతన బకాయిలు

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-నక్కలగుట్ట

కాకతీయ మెడికల్‌ కాలేజీ మెన్స్‌, ఉమెన్స్‌ హాస్టళ్లలో 20ఏండ్లుగా పనిచేస్తున్న 86మంది కార్మికుల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. 8 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా (జయశంకర్‌) పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, 8 నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ నినదించారు. నిరసనలో పాల్గొన ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీ అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోం దన్నారు. టెండర్లు ఇచ్చే ముందు కార్మికుల వేతనాలు సక్రమంగా వస్తాయో లేదో చూసుకోకుండా నిర్లక్ష్యం కనబరుస్తోందని విమర్శించారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు వేతనాల కోసం రోడ్డెక్కడంతో వైద్య విద్యార్థులకు అసౌకర్యం కలుగుతున్నా.. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్‌, తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్‌, అల్లం రమేష్‌, రాణి, రాజకుమారి, ఎండీ అతిక్‌, రాము, మంద కవిత, రవి, బాబు, శశి, సుమన్‌, వంశీ, ప్రశాంత్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad