Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎయిర్ ఫోర్స్ జవాన్ కు నివాళులు..

ఎయిర్ ఫోర్స్ జవాన్ కు నివాళులు..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ (25) ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందడంతో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్  శనివారం నివాళులర్పించారు. ఆగ్రా దగ్గర లో ఉన్న వాటర్ ఫాల్ లో ప్రమాదవశాత్తు జవాన్ దమ్మ వాటర్ ఫాల్ పడి మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా వచ్చేటట్లు చర్యలు తీసుకున్నారు. శనివారం స్వగ్రామానికి మృతదేహం చేరుకుంది. దీంతో శవపేటికపై  పుష్పగుచ్చం ఉంచి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నర్సగౌడ్, రవి తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad