- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్రెడ్డి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
- Advertisement -