నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ లో శనివారం చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు. సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం ఆశా కార్యకర్తలుఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైన పాత వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జ్వరాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎంలు దుర్గ, అమృత, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కోన సముందర్ లో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES