– నియోజక వర్గంలో..
– పంచాయితీలు 102
– వార్డులు 942
– ఓటర్లు 1,44,403 ఓటర్లు జాబితాలను ప్రకటించిన ఎంపీడీఓ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ చివరినాటికి జరిపించాలనే కోర్ట్ ఆదేశాలు మేరకు తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణ పై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ జిల్లా అధికారులకు రూపొందించిన ఓటర్లు జాబితా ప్రకటించడం,రాజకీయ పార్టీల అభ్యంతరాలు స్వీకరించడం,తుది జాబితా రూపొందించే విధంగా ఈ నెల 28 వ తేదీ నుండి సెప్టెంబర్ 2 వ తేదీ వరకు కార్యాచరణకు ఆదేశించడంతో నియోజక వర్గంలోని 5 మండలాలకు చెందిన పంచాయితీల వారీ ఓటర్లు జాబితాలను గురువారం ఆయా కార్యాలయాల్లో ప్రదర్శించారు.అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాల ఎంపీడీఓ లు అప్పారావు,రవీంద్రారెడ్డి,రామారావు,మహాలక్ష్మి,అశోక్ లు తెలిపిన వివరాలు ప్రకారం నియోజక వర్గం 5 మండలాల్లో 102 పంచాయితీలు,942 వార్డులకు పురుషులు 70,072,స్త్రీలు 74298,ఇతరులు 03,మొత్తం 1,44,403 మంది ఓటర్లు గా నమోదు అయినట్లు తెలిపారు.
అశ్వారావుపేట లో…
పంచాయితీలు : 27
వార్డులు : 234
పురుషులు : 14923
స్త్రీలు : 15766
ఇతరులు : 02
మొత్తం : 30691
దమ్మపేట లో…
పంచాయితీలు : 31
వార్డులు : 290
పురుషులు : 21290
స్త్రీలు : 23256
ఇతరులు : లేరు
మొత్తం : 44546
ములకలపల్లి లో…
పంచాయితీలు : 20
వార్డులు : 186
పురుషులు : 13856
స్త్రీలు : 14493
ఇతరులు : లేరు
మొత్తం : 28379
అన్నపురెడ్డిపల్లి లో…
పంచాయితీలు : 10
వార్డులు : 98
పురుషులు : 8363
స్త్రీలు : 8569
ఇతరులు : లేరు
మొత్తం : 16932
చండ్రుగొండ లో…
పంచాయితీలు : 14
వార్డులు : 134
పురుషులు : 11640
స్త్రీలు : 12214
ఇతరులు : 01
మొత్తం : 23855