Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఇటుకలు అందిస్తాం:  జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఇటుకలు అందిస్తాం:  జిల్లా కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరియు ఉపాధి హామీ పథకం పనులకు నాణ్యమైన ఇటుకలను తక్కువ ఖర్చుతో అందిస్తామని భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం మణుగూరు మండలం దమ్మక్కపేట సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్  బీటీపీ‌ఎస్ వద్ద ఫ్లై యాష్ వినియోగంతో నాణ్యమైన ఇటుకలు తయారీ విధానాన్ని గ జిల్లా కలెక్టర్  జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇటుకల తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పథకం పనులలో అధిక నాణ్యత కలిగిన నిర్మాణ సామాగ్రి అందించడం ప్రధాన లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు. ఫ్లై యాష్ వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు ఉత్పత్తి తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని సమర్థవంతంగా వినియోగించి ఇటుకలని తయారుచేసి ఉపయోగించవచ్చని చెప్పారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా ఇటుకలను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరియు ఉపాధి హామీ పథకం పనుల్లో అధిక నాణ్యత కలిగిన నిర్మాణ సామాగ్రి అందించడం ముఖ్యమైనది అని అన్నారు ఇసుక, సిమెంట్, ఫ్లై యాష్ మరియు మట్టి (క్లే) మిశ్రమాలతో ఇటుకలు తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలో, నాణ్యమైన ఇటుకలను అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. వీటిపై విస్తృత ప్రచారం జరగడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఇటుకల తయారికి దోహదం అవుతుందని, తద్వారా లబ్ధిదారులు నేరుగా లాభపడగలరని తెలిపారు. ఆగస్టు 30న బీటీపీ‌ఎస్‌లో మూడు మిషన్ల ద్వారా వివిధ మిశ్రమాలతో నాణ్యమైన ఇటుకలను తయారుచేసే విధానంపై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడుతుంది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని శిక్షణ పొందవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీటీపీ‌ఎస్ చీఫ్ ఇంజనీర్‌లు, సూపర్డెంట్ ఇంజనీర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, గృహ నిర్మాణ విభాగ ఇంజనీర్లు, తాసిల్దార్, ఎంపీడీఓ ఏపీఓ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad