- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 33 ఏళ్ల ఆ క్రికెటర్ పాకిస్థాన్ తరపున 58 టీ20 మ్యాచ్లు, 21 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 959 రన్స్ చేశాడు. దీంట్లో మూడు సెంచరీలు ఉన్నాయి. చివరి సారి అతను 2023 ఆసియా గేమ్స్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022, 2021 పాక్ టీ20 వరల్డ్కప్ జట్టులో అతను ఆడాడు. పాకిస్థాన్ జెర్సీ ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని, దేశం తరపున ఆడడం గర్వంగా ఫీలవుతున్నట్లు తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
- Advertisement -