మండల అధ్యక్షులుగా ఎం.మహేందర్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది .మండలంలో ఉన్న అన్ని గ్రామాల పోటోగ్రాఫర్ లు అర్గుల్ లోనూ మైత్రి గార్డెన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ను ఏర్పాటు చేసుకొని మండల అధ్యక్షులుగా ఎం మహేందర్ , ఉపాధ్యక్షులుగా తొర్లికొండ కుమార్, జక్రాన్ పల్లి సురేష్ ,ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ మునిపల్లి శంకర్ తొర్లికొండ, కార్యదర్శి రవి జక్రంపల్లి వీళ్లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటోగ్రాఫర్ లు వారి కుటుంబం కోసం మా యూనియన్ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కలిసి కట్టుగా పనిచేస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధాన పోటోగ్రాఫర్లు పాల్గొన్నారు