Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్నెల తరవాత.. దేవుడి హుండీ సొమ్మును తిరిగి అక్కడే ఉంచిన దొంగలు

నెల తరవాత.. దేవుడి హుండీ సొమ్మును తిరిగి అక్కడే ఉంచిన దొంగలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువుకట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. హుండీలో నగదు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు రూ.1,86,486 ఉన్నట్లు వారు తెలిపారు. అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad