Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..

- Advertisement -

సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించిన ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి
నవతెలంగాణ – కాటారం

ఎదుటి వారికి విద్య అందించడం ద్వారా తమ విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా విద్యను బోధించి ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి  అన్నారు. శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కాటారం మండలం దామెరకుంట గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సర్వేపల్లితో పాటు సావిత్రిబాయి పూలే, జ్యోతి బాపులే చిత్రపటాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… భవితరాల భవిష్యత్తులకు విద్యనే పునాది అని నమ్మి ఆచరించిన మహోన్నత వ్యక్తి రాధాకృష్ణ అని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు తలుసుకుంటే విద్యార్థిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకొని ఆచరించిన ఆ మహానుభావుడు జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు అని తెలిపారు. నాలుగు దశాబ్దాల ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించి తత్వ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన ఘనత ఆయన సొంతమన్నారు. మహనీయుల సర్వేపల్లి, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేని ఆదర్శం తీసుకొని  బాలికల ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దు తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ వజ్మా తస్లీమ్, ఉపాధ్యాయునిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad