- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే బాస బాలకిషన్ బాదం ఆకుపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని గీసి తన గురువులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పిస్తారని తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని గీసిన కళాకారుడి నైపుణ్యానికి ప్రతి ఒక్కరూ అభినందించారు.
- Advertisement -