- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రంలోని రెంజల్ శంభాజీ నగర్ లోని గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కాలనీకి సాంబాజీ నగర్ అని నామకరణం చేసి ఎస్సై కే చంద్రమోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీవాసులు ఐక్యమత్యంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో గణేష్ మండలి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.
- Advertisement -