- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
స్థానిక ఎన్నికలకు మరో కీలక అడుగు పడింది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లకు సిద్ధమవుతుంది. చారకొండ మండల కేంద్రంలోని రేపు ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ నందు ఎంపీటీసీ 1 మరియు 2 ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లుగా ఎంపీడీవో శంకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఓటర్లకు అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా రాసి ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వగలరని అన్నారు. అభ్యంతరములు స్వీకరించు చివరి తేదీ ఈ నెల 8 వరకు గడువు ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి గణేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -