Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅందుబాటులో 77 వేల టన్నుల ఎరువులు

అందుబాటులో 77 వేల టన్నుల ఎరువులు

- Advertisement -

సిఎం చంద్రబాబు
రబీకి వెబ్‌ల్యాండ్‌, ఇ-పంట ఆధారంగా ఎరువులు

అమరావతి : రాష్ట్రంలో ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని, రైతులకు డిమాండు మేరకు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, వ్యవసాయశాఖ అధికారులతో సిఎం శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎరువుల సరఫరాపై ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా సమీక్ష నిర్వహించారు. అధికారులు ఇచ్చే సమాచారంతోపాటు ఆయా జిల్లాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని పోల్చి ఎంత స్థాయిలో అందుబాటులో ఉన్నాయో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 77,396 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
బాపట్ల, కృష్ణా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. సమస్యను సత్వరమే పరిష్కరిం చాలని సూచించారు. గ్రామ, వార్డు సచి వాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టరు వరకూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీ లించాలన్నారు. ఎరు వుల లభ్యత గురించి రైతులకు వివరించి వాళ్లు ఎటువంటి ఇబ్బందీ పడకుండా చూడా లన్నారు. అందరికీ ఎరువులు అందుతాయనే భరోసాను రైతులకు కలిగించాలని చెప్పారు. వచ్చే రబీలో వెబ్‌ల్యాండ్‌, ఇ-పంట అనుసంధానంతో రైతుల ఆధార్‌ ఆధారంగా ఎరువుల సరఫరా చేపట్టాలని సిఎం తెలిపారు. దీనికోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ఎవరు ఎంత పంట వేస్తారో ఇ-పంట నమోదు ద్వారా చూసి వారికి అవసరమైన మేరకు ఎరువులు ఇచ్చే మెకానిజం తీసుకురావాలని అన్నారు. కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి బాధ్యత తీసుకుని రైతులకు ఎరువుల సరఫరాపై అవగాహన కల్పించడాన్ని ముఖ్యమంత్రి ప్రసంశించారు. అన్ని జిల్లాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టి ఎరువులు సరఫరాలో ఉన్న అన్ని అనుమానాలనూ తొలగించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad