Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో 11 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ 

ప్రజావాణిలో 11 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.   ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ , వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల , పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని  పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని తెలియజేశారువివిధ ఫిర్యాదు లకు సంబందించిన 11 ఫిర్యాదు లను స్వీకరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad