Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: భార‌త్

నేపాల్‌లో భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: భార‌త్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.

‘జనరేషన్​ జడ్​ డిమాండ్’ మేరకు సోషల్​ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు వెల్లడించారు. ఈక్ర‌మంలో ఆదేశ ప్ర‌ధాని ఓలి ఆల్ పార్టీ మీటింగ్ ఆదేశాలు జారీ జేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad