హమాస్ నేతలే టార్గెట్
పిరికిపంద చర్య : ఖతార్ విదేశాంగశాఖ
దోహా: హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయిల్ మంగళవారం జరిపిన క్షిపణిదాడులతో ఖతార్ దద్దరిల్లింది. ఆ దేశ రాజధాని దోహాలో పెద్దఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే, ఈ దాడి ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? తదితర వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వైమానిక దళం ఈ పని పూర్తిచేసినట్టు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి కర్నల్ అవిచారు అడ్రాయీ వెల్లడించారు.ఖతార్లో జరిగిన దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు. హమాస్ అగ్రనేతలే లక్ష్యంగా స్వతంత్ర ఆపరేషన్ చేపట్టామని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ తామే నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి బాధ్యత కూడా తీసుకుంటున్నామని రాసుకొచ్చారు. మరోవైపు తమ దేశంలోని హమాస్ పొలిటికల్ హెడ్క్వార్టర్స్పై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందంటూ విదేశాంగశాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ ఈ నిర్లక్య ప్రవర్తన వల్ల ప్రాంతీయ భద్రతకు అంతరాయం జరుగుతుందని అన్నారు. ఇలాంటి చర్యలను ఎప్పటికి సహించబోమని తెలిపారు.ఈ దాడిని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం అభివర్ణించారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్. ఇది చాలా ప్రమాదకరమైన నేరపూరిత చర్య అని అన్నారు. అంతర్జాతీయ నియమాలు, చట్టాలను, ఖతార్ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది ఆరోపించారు. ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ సైతం ఇజ్రాయిల్ చర్యలను తప్పుపట్టారు. ఇజ్రాయిల్- హమాస్ల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఖతార్ అనేక ఏండ్ల పాటు మధ్యవర్తిగా వ్వవహరించింది. ఆ దేశ చొరవను టెల్అవీవ్ పలు సందర్భాల్లో స్వాగతించింది. అదే సమయంలో హమాస్పై ఒత్తిడి తీసుకురావడం లేదంటూ విమర్శలూ గుప్పించింది. గాజా యుద్ధం మొదలు ఖతార్లో దాడులు జరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్లో ఇజ్రాయిల్- ఇరాన్ల మధ్య ఉద్రిక్త తల సమయంలో ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. గాజా సిటీని ఖాళీ చేసి పౌరులంతా దక్షిణ గాజాకు తరలివెళ్లాలని ఇజ్రాయిల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది.
ఖతార్పై ఇజ్రాయిల్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES