- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ వీరనారిగా మారి నేటి తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలంగాణ జన సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష అభిప్రాయపడ్డారు. ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఐలమ్మ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాట స్ఫూర్తిని ,త్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం జరిగిందని అన్నారు.
- Advertisement -