- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొమురం భీం జిల్లా వాంకిడి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుళ్లు మృతి చెందారు. డాబా గ్రామానికి చెందిన భుజిబాయి(35) చికిలి వాగులో యూరియా బస్తాలు కడగడానికి తన ముగ్గురు పిల్లలతో వెళ్లింది. ప్రమాదవశాత్తు చిన్న కూతురు శశికళ(7) వాగులో కొట్టుకుపోగా.. కాపాడటానికి వెళ్లిన తల్లి, ఇద్దరు కూతుళ్లు కూడా కొట్టుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -