- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలోని రంగాపూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై పెద్దగుంత ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు మైలారం జంగయ్య సిమెంట్, డస్ట్ కలిపి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఈ దారి వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు గుంతను తప్పించుకోవడం తప్ప ఎలాంటి మనమత్తులకు నోచుకోలేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్ బీ అధికారులు గుంతలు మాయగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -