నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజినీర్లదేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషి స్తున్న ఇంజినీర్లందరికీ ముఖ్యమంత్రి ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థికా భివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారని సీఎం గుర్తుచేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేకతను చాటా రని తెలిపారు. అత్యుత్తమ సాంకేతికతతో వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం చెప్పారు. మూసీ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టటంలో ప్రత్యేక చొరవ చూపించారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్ధులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్స్ తమవంతు పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు.
దేశాభివృద్ధిలో ఇంజినీర్లది కీలకపాత్ర : సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES