లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్
నవతెలంగాణ – కట్టంగూర్
సమాజ సేవతో జీవితానికి సంతృప్తి లభిస్తుందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ జరిగిన లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థని 210 దేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి బసవోజు వినోద్ కుమార్, జీఎస్టీ ఆకవరపు బ్రహ్మచారి, జీఎంటీ కక్కిరేణి నవీన్, జీఈటీ తవిదబోయిన నర్సింహ్మ, ఎల్సీఐఎఫ్ బొల్లోజు వెంకటాచారి, ప్రచారకర్త చెరుకు శ్రీనివాస్, గౌరవ సలహాదారుడు వున్న సుందరయ్య లతో పాటు క్లబ్ కార్యవర్గ సభ్యులతో పీఎంసీసీ గోలి అమరేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం నూతన కార్యవర్గానికి శాలువాలు, పూలమాలలు కప్పి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కేవీ.ప్రసాద్, కోడే సతీష్ కుమార్, గట్టుపల్లి అశోక్ రెడ్డి , కొండ సంతోష్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, జోన్ చైర్మన్లు బుడిగ శ్రీనివాస్, లక్మారెడ్డి, శంభులింగారెడ్డి, సత్యనారాయణ, దేవరశెట్టి శ్రీనివాస్, కందాల పాపిరెడ్డి, నెమరుగొమ్ముల రాంమోహన్, ఎదుళ్ల అంజిరెడ్డి, రేపాల సతీష్, కందాల ప్రేమ్ నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
సమాజ సేవతోనే జీవితం సంతృప్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES