నవతెలంగాణ – హైదరాబాద్
దసరా పండుగ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు లక్ష్మణ్ యాదవ్, నారాయణస్వామి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శుంబుల శ్రీకాంత్ గౌడ్ రామ్మోహన్ గడ్డం శ్రీధర్ గౌడ్, జహంగీర్, సి. సుధాకర్ తదితరు పాల్గొన్నారు.
ఆలయ్ బలయ్ కు వీహెచ్ను ఆహ్వానించిన దత్తాత్రేయ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES