- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ లో బతుకమ్మ వేడుకలు ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు తోటకూర యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. రంగు రంగుల పువ్వులను బతుకమ్మగా పేర్చి, గౌరమ్మను పూజించి మహిళలు ఆడుతూ ఉత్సాహంగా చేసుకునే పండుగ -బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -