- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని, పూలతో పూలనే పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ వేడుకల్ని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని ప్రిన్సిపల్ హరిబాబు ఆకాంక్షించారు. శనివారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని ది మాస్టర్ మైండ్స్ స్కూల్ లో బతుకమ్మ సంబరాల్ని ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వైవీ రావు, బిట్ల యాదగిరి, దువ్వాల శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -