- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
రేపు అచ్చంపేటలో జరిగే ‘జన గర్జన’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చింతపల్లి చండీశ్వర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగే జన గర్జన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని మండలం నుండి BRS నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు,ప్రజలు వేలాదిగా తరలి వెళ్లి అచ్చంపేట జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -