- Advertisement -
నవతెలంగా- వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని పోతే పల్లి గ్రామ శివారులో కే ఎల్ ఐ ది 82 కాలువకు మరోసారి గండి పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోతేపల్లి గ్రామ శివారులో కే ఎల్ ఐ కాలువ ద్వారా వస్తున్న నీటి ఉధృతికి కాల్వ ఒక్కసారిగా తెగిపోయి నీరు వృధాగా పోతుంది. మండలంలో ప్రతి సంవత్సరం పలుమార్లు కే ఎల్ ఐ కాల్వకు గండుపడడం పరిపాటిగా మారిందని మండల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -