- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుకాలం ప్రశ్నించి పండించిన పంటను దళారులకు విక్రయించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా రైతులకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఇంద్రసేన్, ఇంచార్జ్ కిషోర్ కుమార్, ఎల్ శ్రీనివాస్, సాయిబాబా, హరీష్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -