- Advertisement -
13 మందికి జరిమాన..
నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి రెండు రోజుల్లో జైలు శిక్ష పడగా 13 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 13 మందికి 19500/- విధించామని తెలిపారు. మహమ్మద్ జహీర్, లంబడి అర్జున్, గొడుగు కాశి అను వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
- Advertisement -