- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల గాంధీ నగర్ లో గల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు, కోశాధికారి గోపికృష్ణ, సభ్యులు అల్జాపూర్ రాజేష్, బారడ్ బాలాజీ రావు, మాధవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -