- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
కార్తీకమాసంలో భాగంగా రెండవ రోజు బుధవారం తెల్లవారుజామున భజన, భజనతంత్రాలతో వాడ వాడలా అన్నిరకాల మందిరలలో హరితి లు నిర్వహిస్తూ ప్రభాత్ పేరిని భక్తులు కొనసాగించారు. మద్నూర్ మండల కేంద్రంలో ఇలాంటి ప్రబాత్ పేరి వందల సంవత్సరాలనుండి కొనసాగుతూ వస్తుందని ప్రముఖులు తెలిపారు. పూజారి సంగయ్యప్ప ఆధ్వర్యంలో కొనసాగే భజన తంత్రంలో, కులాలకు అతీతంగా భక్తులు పురుషులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున అన్ని మందిరాలకు భజన తంత్రాలతో భక్తులు వెళ్లి ప్రదక్షిణాలు హారతి కార్యక్రమాలు నెలరోజులపాటు కొనసాగించనున్నారు.
- Advertisement -