- Advertisement -
మండల స్పెషల్ ఆఫీసర్ ఏడి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో ఐకెపి ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎడి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏపిఎం తిరుపతి, ఏఈఓ సంగీత , సీసీ రాజు ,బిక్షపతి గ్రామ సంఘం అధ్యక్షురాలు యమున, మౌనిక, వివో ఏ పులి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -